తెలంగాణా కావాలనుకోవడం "మోసమా?"

తెలంగాణా కావాలనుకోవడం "మోసమా?"

మేము ఓకే పోస్టు ఈ బ్లాగు లో పెట్టినాము. దానికి ఎవరికీ నచ్చిన అభిప్రాయాలు వారు ఇచ్చినారు. కాని, ఒకరు మాత్రము చిత్రమైన అభిప్రాయము చెప్పినారు. తెలంగాణ కావాలనుకోవడం, బూతులు తిట్టడం ఆయన దృష్టిలో "మోసమాట?"


Comments

  1. నైజాం నూ అంధ్ర నూ కలిపి ఆంధ్రప్రదేశ్ గా చేసినప్పుడు మెదలకుండా ఉన్న తెలంగాణా వారు 1969 లో తెలంగాణా ఉద్యమం మొదలు పెట్టారు. అప్పటికి హైదరాబాదు అభివృధ్ధి లో ఆంధ్ర ప్రాంతం వారి ప్రమేయం తక్కువ. కాబట్టీ అప్పటి తెలంగాణ ఉద్యమం లో మోసం ఉందని అనలేం. మనము అనే భావన వృధ్ధి చెందకపోవటం వలనా, మీరూ మేము అనే భావనల వలనా (కారణాలు ఏమైతేనేమి) వచ్చిన ఉద్యమం అది. దానిని చెన్నా రెడ్డి వంటి రాజకీయులు ఉపయోగించుకోవటం వేరే విషయం. అప్పుడే కనుక హైదరాబాద్ రాజధాని గా తెలంగాణ ఏర్పడితే ఆంధ్ర ప్రాంతం వారు పట్టించుకొనే వారు కాదు. అప్పట్లో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం గా ఆంధ్ర లో ఏ ఉద్యమమూ రాక పోవటం దీనికి ఒక నిదర్శనం.
    తరువాత హైదరాబాద్ కి తీరాంధ్రుల వలసలు పెరిగి వారికి హైదరాబాద్ తో ఒక అనుబంధం పెరిగింది. అభివృధ్ధి చెందిన హైదరాబాద్ ను దృష్టి లో ఉంచుకొని కొందరు తెలంగాణా వాదులు ప్రత్యేక రాష్ట్రం కావాలనటం తప్పనిసరిగా మోసమే. తెలంగాణ వాదులు మా బాస వేరు, మా యాస వేరు, మా గోస వేరు అని ఉద్యమం మొదలు పెట్టారు.
    నలభయ్యవ దశకం లో హైదరాబాదు లో ఉన్న తెలంగాణ వారి సంఖ్య 8%. మిగిలిన తెలంగాణ తో పోలిస్తే హైదరాబాద్ లోని భాష వేరు , యాస వేరు, మతం వేరు. ఏ రకం గానూ తెలంగాణ సంస్కృతి లో కలవని హైదరాబాదు తెలంగాణ కు ముఖ్యనగరం గా కావాలని పట్టు పట్టటం లో పస లేదు.ఏ వరంగల్లో రాజధానిగా తెలంగాణ ఏర్పాటు కు ఎందుకు ఒప్పుకోరు? ఓరుగల్లు కంటే తెలంగాణ ప్రాంత భాష కీ సంస్కృతికీ వారసత్వానికీ గొప్ప ప్రతీక ఏముంది? అప్పుడు ఆంధ్ర ప్రాంతం వారు హైదరాబాదు తమ రాజధాని కావాలని అడగరు. ఏ కేంద్ర పాలిత ప్రాంతం అవ్వటం అనేది ఒక విషయం.
    ఉమ్మడి రాష్ట్రానికి ఆ రోజుల్లో తెలంగాణ నేతలు (బూర్గుల, తెలంగాణ అసెంబ్లీ తీర్మానం మొదలైనవి) ఒప్పుకొనక పోతే, ఆంధ్ర ప్రాంతం వారు హాయిగా ఏ విజయవాడ నో తమ రాజధాని గా అభివృధ్ధి చేసుకొనే వారు. వారి రాజధాని ఖచ్చితం గా ఇప్పటి విజయవాడ కంటే అభివృధ్ధి చెందేది.
    కాబట్టీ ఏ ఉద్దేశ్యం తో తెలంగాణ అడుగుతున్నారనేది ముఖ్యం. హైదరాబాదు ని లాగాలనే ఉద్దేశం తో అడిగే తెలంగాణా వాదులు ఆంధ్ర ప్రాంతం వారిని మోసం చేసినట్లే. వారి స్వార్థం కోసం తమ తోటి ఆంధ్రుల అభిప్రాయాన్ని, హక్కునీ విస్మరించినట్లే!

    ReplyDelete
  2. ఇన్ని చర్చలు జరిగినా,
    ఇంత పోరాటాలు జరిగినా,
    ఇన్ని వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్నా,......
    ఇంకా ఇంత తలకిందులుగా...
    ఇంత అమానుషంగా ఎలా ఆలోచించ గలుగు తున్నారు మీరు ???????

    1969 ఉద్యమాన్ని చెన్నారెడ్డి
    తన స్వార్ధ ప్రయోజనాలకోసం వంచించిన మాట వాస్తవమే.
    కాని అంతకంటే ముందు
    ఆ మహా ఉద్యమాన్ని అణిచివేసేందుకు బ్రహ్మానంద రెడ్డి సీమాంధ్ర ప్రభుత్వం
    369 మంది ప్రాణాలు బలి తీసుకుని
    తెలంగాణా వీధుల్లో నెత్తురులు ఎందుకు ప్రవహింప చేసింది?
    ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా ఎందుకు బ్రూటల్ గా అనిచివేసింది???
    స్వార్ధంతో కాదూ... అది పరమ దుర్మార్గం కాదూ, మోసం కాదూ....?

    పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకుంటారు చిత్త శుద్ధితో అమలు పరచరు .
    ముల్కీ నిబంధనలకు హామీ ఇస్తారు అమలు లో వంచిస్తారు.
    మీరే 610 జీ వో తీస్తారు మీరే ఆటకేక్కిస్తారు.
    కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం అన్ని పార్టీల సీమాంధ్ర నాయకులు
    ఎన్నికల మనిఫెస్తోల్లో, ఎన్నికల ప్రచారాల్లో అసెంబ్లీలో తెలంగాణా ఇచేస్తాం
    తెలంగాణా కు కట్టుబడి ఉన్నాం అని బాహాటం గా హామీలు గుప్పిస్తారు.....
    అమలు దగ్గరకు వచ్చే సరికి తెడ్డు చూపిస్తారు.
    ఇవి కదా అసలైన మోసాలు.
    ఈ మోసాల గురించి ఎందుకు మాట్లాదరు.???

    హైదరాబాద్ మీద కన్నేసి సీమాంధ్ర నాయకులే
    ఎత్తులు జిత్తులతో తెలంగాణాను కబలించారు.
    ఈ కింది నాయకుల మాటలు చూడండి.....

    ..." హైదరాబాద్ మనతో కలిస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి.
    కానీ అది ఎలా సాధ్యం ?
    దాన్ని ఎలా సాధించగలమనే విషయం పై ఆలోచన చేయాలి. ...."
    ----------- టంగుటూరి ప్రకాశం పంతులు , 1953
    ...." రాజధానికి అవసరమైన సదుపాయాలున్న నగరమేదీ మనకు లేదు....."
    ----------- - నీలం సంజీవ రెడ్డి.

    ఇక ఆరోజుల్లో హైదరాబాద్ రాష్ట్రం లో ఇప్పటి కర్నాటక, మహారాష్ట్ర భూభాగాలకు
    చెందినా ఏడు జిల్లాలు ఉండేవి. భాషా ప్రాతిపదికన వాటిని ఆయా రాష్ట్రాల్లో కలిపేయాలని
    నిర్ణయించారు. ఆ జిల్లాల ఎం ఎల్ ఎ లకు అలాంటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణా భూభాగాన్ని
    ఆంధ్రలో కలపాలని తీర్మానం చేసే హాక్కే లేదు.
    అందుకే మొదటి ఎస్ ఆర్ సి లో ఆయా జిల్లాలు పోగా మిగిలిన తెలంగాణా
    ప్రాంతాన్ని ప్రత్యెక రాష్ట్రంగా కొనసాగనిచ్చి 1962 లో సాధారణ ఎన్నికల అనంతరం
    ఆ తెలంగాణా అసెంబ్లీ ఒప్పుకుంటే, అప్పుడు ఆంధ్ర లో విలీనం చేయాలనీ ఫజల్ అలీ కచ్చితంగా చెప్పాడు.
    అయినా లాబీ యింగ్ చేసి తెలంగాణాను కబళించింది సీమాంధ్ర నాయకులు.

    ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవర్ని మోసం చేసారో ...?
    పరస్పార అవిశ్వాసం ఏర్పడిన తర్వాత ఇంకా కలసి వుండడం ఎలా సాధ్యం
    పోలీస్లు తుపాకులే మన లను సమైక్యంగా ఉంచ గలుగు తాయని ఇంకా భ్రమిస్తున్నారా?
    ఈ కాలం లోనూ .................?

    ReplyDelete
  3. జై తెలంగాణా...!
    జై జై తెలంగాణా ...!!

    జోర్‌ సే బోలో... ప్యార్‌ సే బోలో...
    జై తెలంగాణా... జై తెలంగాణా...!

    మా నీళ్లు ... మాకు గావాలె.
    మా ఉద్యోగాలు ... మాకు గావాలె !!
    మా నిధులు ... మాకు గావాలె !!
    మా తెలంగాణా ... మాకు గావాలె !!!!!

    ఔర్‌ ఏక్‌ ధక్కా........ తెలంగాణా పక్కా...!

    ఆగదు ఆగదు ఆగదు తెలంగాణా పోరు ఆగదు
    సాగదు సాగదు సాగదు ఆంధ్రోళ్ల పాలన ఇక సాగదు

    వాడెవ్వడు వీడెవ్వడు...? తెలంగాణాకు అడ్డెవ్వడు...??
    తెలంగాణాకు అడ్డొస్తే ... అడ్డంగా నరికేస్తాం...!!

    జోహార్‌ తెలంగాణా విద్యార్థి అమరవీరులకు..
    జోహార్‌ జోహార్‌!

    ReplyDelete

Post a Comment