జగన్ గారు దీక్ష చేస్తున్నారు, ప్రజలు జాగ్రత్త

జగన్ గారు దీక్ష చేస్తున్నారు, ప్రజలు జాగ్రత్త

అసలు, జగన్ దీక్ష చేస్తున్నారని ఈ రోజు వరకు మాకు తెలియదు, పాపం , ఆయన కేవలం నీరు మాత్రమె తాగి గాలి తింటూన్నారని తెలిసినది. ప్రజలు చాల జాగ్రత్తగా ఉండాలి. YSR పాదయాత్ర చేసారు, అధికారం లోకి వచ్చారు, భూమి విలువ మధ్య తరగతి వారికి అందనంత గా పెరిగి పోయినది. తమ బంధు గణానికి పదవుల పందేరం భూ పంపకం జరిగి పోయినది.

ఇప్పుడు, మా ఖర్మ గాలి, ఇయన గారు అధికారం లోకి వస్తే (వస్తరంటార?) ప్రజలకు గాలి తిని బ్రతక వలసి రావచ్చు. నీరు ఎలాగో కొని తాగవలసిన పరిస్తితి. ఎలాగో ఆంధ్ర లో నీరు దరకక పోయిన బీరు (మందు) మాత్రం ప్రతి చోట దొరుకుతుంది. గాలి ఫ్రీ గానే దొరుకుతున్న, అది కలుషితమై పోయినది. కాని, ఆయన పుణ్యాన ప్రజలు మాత్రం నీరు కొనుక్కుని , ఉచితం గా దొరికే కలుషితమైన ఆహారం తిని బ్రతకాలి. ద్రవ్యోల్బణం పుణ్యమా అని తిండి తినటం ఇప్పుడు సామనులకు చాల కష్టం గా ఉంది. ఇయన వస్తే అది కూడా దొరకదు.
 

Comments

  1. kannada prajalu monnane nidra lechaaru. inka telugu vaallu epudu nidra lesthaaro....

    ReplyDelete

Post a Comment